పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వసుదేవుని గ్రతువు

  •  
  •  
  •  

10.2-1115-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వదరాతిమర్దనులఁ, బాండురనీలనిభప్రభాంగులం,
లిత నిజాననాంబుజ వికాస జితాంచిత పూర్ణచంద్ర మం
లులఁ, బరేశులన్, నరవిడంబనులం, గరుణాపయోధులన్,
విసదలంకరిష్ణుల, నవీనసహిష్ణుల, రామకృష్ణులన్.

టీకా:

బలవత్ = బలవంతులైన; ఆరాతి = శత్రువులను; మర్దనులన్ = శిక్షించువారిని; పాండుర = తెల్లదనము యొక్క; నీల = ఇంద్రనీలముతో; నిభా = సమాన మైన; ప్రభా = కాంతులు కల; అంగులన్ = దేహులను; కలిత = మనోజ్ఞమైన; నిజ = తమ; ఆనన = ముఖములు అను; అంబుజ = పద్మముల; వికాస = వికాసముచేత; జిత = జయింపబడిన; అంచిత = చక్కటి; పూర్ణ = నిండు; చంద్ర = చంద్ర; మండలులన్ = మండలనులు కలవారిని; పరేశులన్ = సర్వాతీత ప్రభులును; నర = మానవులు; విడంబనులన్ = వలె తోచువారిని; విలసత్ = మిక్కిలి చక్కగా; అలంకరిష్ణులన్ = అలంకరించుకొనువారిని; నవీన = నిత్యనూతన; సహిష్ణులన్ = సహనశీలురను; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణుడులను.

భావము:

బలరామకృష్ణులు బలవంతులైన శత్రువుల్ని నిర్మూలించడంలో సమర్థులు, పూర్ణచంద్రుడి శోభను మించిన చక్కదనాల మోముల వారు, సర్వాతీత ప్రభులు, లీలామానుషవిగ్రహులు, కరుణాసాగరులు, అలంకార ప్రియులు. వారిలో బలరాముడు తెల్లని వాడు, కృష్ణుడు నల్లని వాడు.