పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సకలరాజుల శిక్షించుట

  •  
  •  
  •  

10.2-1110-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్నకుం
ములతో శిరంబులు, రన్మణినూపురరాజితోఁ బదం
బులుఁ, గటకాంగుళీయక విభూషణచాప శరాలితోడఁ జే
తులు, నిలఁగూలఁగా విజయదోహలియై తునుమాడె వెండియున్

టీకా:

అలిగి = కోపగించి; మురాంతకుండు = కృష్ణుడు; కులిశ = వజ్రాయుధము; ఆభ = పోలు; శరంబులన్ = బాణములతో; నూత్న = సరికొత్త; రత్న = రత్నాల; కుండలముల = చెవికుండలముల; తోన్ = తోటి; శిరంబులున్ = తలలు; రణత్ = మోగుచున్న; మణి = రత్నాల; నూపుర = కాలి అందెల; రాజి = సమూహము; తోన్ = తోటి; పదంబులున్ = కాళ్ళు; కటక = చేతి కడియాలు; అంగుళీయక = వేళ్ళ ఉంగరాలు; విభూషణ = ఆలంకారములు; చాప = ధనుస్సు; శర = బాణములు; ఆలి = సమూహము; తోడన్ = తోటి; చేతులున్ = చేతులు; ఇలన్ = నేలపై; కూలగా = పడిపోగా; విజయ = గెలుపుకైన; దోహలి = సమర్థత కలవాడు; ఐ = అయ్యి; తునుమాడెన్ = సంహరించెను; వెండియున్ = పిమ్మట.

భావము:

అది చూసి కృష్ణునికి మిక్కిలి ఆగ్రహం కలిగింది. ఆయన వజ్రాయుధానికి సాటివచ్చే వాడిబాణాలను ప్రయోగించాడు. కర్ణకుండలాలతో కూడిన శత్రురాజుల శిరస్సులూ, నూపురాలతో పాటూ పాదాలూ కంకణాలతో పాటు చేతులూ తెగి నేలపై కూలేలా చేసి శత్రువు లయిన సకల రాజులను నిర్మూలించాడు.