పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

  •  
  •  
  •  

10.2-1098-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ
త్కజలజాత దివ్యమణి కాంచనమాలిక నమ్మురారి కం
మున లీలమై నిడి పదంపడి నవ్య మధూకదామ మా
రికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్.

టీకా:

నరపతులన్ = రాజు లందరిని; కనుంగొని = చూసి; మనంబునన్ = మనస్సు నందు; వారిన్ = వారిని; తృణీకరించి = తిరస్కరించి; మత్ = నా యొక్క; కర = చేతులు అను; జలజాత = పద్మాలలోని; దివ్య = గొప్ప; మణి = రత్నాలు కల; కాంచన = బంగారు; మాలికన్ = దండను; ఆ = ఆ; మురారి = కృష్ణుని; కంధరమునన్ = మెడలో; లీలమై = విలాసముతో; ఇడి = వేసి; పదంపడి = పిమ్మట; నవ్య = కొత్త; మధూక = ఇప్పపూల; దామము = దండను {దండ దామము - దారమునందు గుచ్చి రెండు పక్కల కలపకుండా ఉండునది దామము, రెండు పక్కల కలిపేసినది దండ}; ఆ = ఆ; హరి = కృష్ణుని; కబరిన్ = కొప్పునందు; తగిల్చితిన్ = తురిమితిని; నయంబునన్ = చక్కగా; కన్నులన్ = కన్నులలో; లజ్జ = సిగ్గులు; తేఱగన్ = కనబడుచుండగా.

భావము:

రాజకుమారులను అందరినీ మనసులోనే తృణీకరించాను. నా చేతులలో ఉన్న దివ్యమైన మణులు పొదిగిన బంగారు హారాన్ని శ్రీకృష్ణుని మెడలో వేశాను. అలాగే నవ్య ఇప్పపూలదండతో ఆయన వక్షాన్ని అలంకరించాను. ఆ సమయాన నా కళ్ళల్లో సిగ్గు తొణికిసలాడింది.