పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నందాదులు చనుదెంచుట

  •  
  •  
  •  

10.2-1068-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళినదళాక్షుఁ జూచి నయనంబులు మోడ్వఁగఁ జాల కాత్మలన్
చి తదీయమూర్తి విభవంబు దలంచుచుఁ గౌఁగిలించుచుం
బుకలు మేన జాదుకొనఁ బొల్తులు సొక్కిరి బ్రహ్మమున్ మనం
బులఁ గని చొక్కు యోగిజనముం బురుడింపఁగ మానవేశ్వరా!

టీకా:

నళినదళాక్షున్ = కృష్ణుని; చూచి = చూసి; నయనంబులు = కన్నులు; మోడ్వగజాలక = మూయనేరక; ఆత్మలన్ = మనసు లందు; వలచి = కోరి; తదీయ = అతని; మూర్తి = స్వరూప; విభవంబున్ = వైభవములను; తలంచుచున్ = తలచుకొనుచు; కౌగలించుచున్ = ఆలింగనములు చేసికొని; పులకలు = గగుర్పాటులు; మేనన్ = దేహము లందు; జాదుకొనన్ = మొలకలెత్తగా; పొల్తులు = యువతులు {పొల్తు - పొలతి, స్త్రీ}; సొక్కిరి = సోలిరి; బ్రహ్మమున్ = పరబ్రహ్మను; మనంబులన్ = మనసు లందు; కని = చూసి; చొక్కు = సోలిపోయెడి; యోగి = మునుల; జనమున్ = సమూహములను; పురుడింపగనా = సరిపోలగా; మానవేశ్వరా = రాజా.

భావము:

పద్మదళాక్షుడు గోపాలుడిని చూస్తున్నంతసేపూ ఆ గోపికలు తమ కళ్ళ రెప్పలను వాల్చలేకపోయారు. వారు కృష్ణుని జగన్మోహన సౌందర్య వైభవాన్ని వర్ణించుకుంటూ, తమ మనసులలో కౌగలించుకుంటూ, బ్రహ్మసాక్షాత్కారం పొందిన యోగులలాగా ఆ గోపస్త్రీలు పరవశించగా వారి తనువులు గగుర్పొడిచాయి.