పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నందాదులు చనుదెంచుట

  •  
  •  
  •  

10.2-1067-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు ప్రియాలాపంబులు పలుకుచుండు నవసరంబున గోపాలసుందరు లమందానంద కందళితహృదయ లయి హృదయేశ్వరుం డైన గోవిందుఁడు చిరకాలసమాగతుం డగుటం జేసి, యతనిం జూచు తలంపు లుల్లంబుల వెల్లిగొనం జేరి.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రియ = ప్రీతికరమైన; ఆలాపంబులున్ = పలుకులు; పలుకుచుండు = చెప్పుతున్న; అవసరంబునన్ = సమయము నందు; గోపాల = గోపికా; సుందరులు = స్త్రీలు; అమంద = అధికమైన; ఆనంద = ఆనందముతో; కందళిత = చిగురిస్తున్న; హృదయలు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; హృదయేశ్వరుండు = మనోనాయకుడు; ఐన = అయిన; గోవిందుడు = కృష్ణుడు; చిర = చాలా; కాల = కాలము తరువాత; సమాగతుండు = వచ్చినవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; అతనిన్ = అతనిని; చూచు = చూడవలె నను; తలంపులున్ = భావనలు; ఉల్లంబులన్ = మనసులలో; వెల్లిగొనన్ = పొంగిపొర్లగా; చేరి = సమీపించి.

భావము:

రోహిణీదేవి దేవకీదేవి యశోదాదేవితో ఇలా సల్లాపాలు పలుకుతూ ఉండగా, గోపకాంతలు రాకరాక వచ్చిన తమ ప్రాణేశ్వరుడైన శ్రీకృష్ణుడిని చూడాలనే తహతహ ఆనందం హృదయాలలో పొంగిపొరలుతుండగా అక్కడికి చేరారు.