పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కుంతీదేవి దుఃఖంబు

  •  
  •  
  •  

10.2-1054-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఓ న్న! పాండుతనయులు
నీ ల్లుం డ్రడవులందు నెఱి మృగములతోఁ
బాని యిడుమలఁ బడఁ గరు
ణాత్తుల రగుచు మీర రయఁగ వలదే?"

టీకా:

ఓ = ఓ; అన్న = సోదరుడా; పాండు = పాండురాజు యొక్క; తనయులు = పుత్రులు; నీ = నీ యొక్క; అల్లుండ్రు = మేనల్లుళ్ళు; అడవులు = అరణ్యాలు; అందున్ = లో; నెఱిన్ = వక్రముగా, అక్రమముగా; మృగముల్ = క్రూరజంతువుల; తోన్ = తోటి; పాయని = వదలని; ఇడుములన్ = ఆపదలను; పడన్ = పొందుతుండగా; కరుణ = దయ; ఆయత్తులు = కలిగినవారు; అగుచున్ = ఔతు; మీరలు = మీరు; అరయగన్ = విచారించుట; వలదే = వద్దా, అవసరము.

భావము:

“అన్నయ్యా! పాండురాజుకు పుత్రులు, నీకు అల్లుళ్ళూ అయిన పాండవులు కీకారణ్యాలలో భీకరమృగాల మధ్య పలుబాధలు పడతున్నారు. వారిని మీరు దయార్ద్రహృదయంతో చూడాలి కదా.”