పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శమంతకపంచకమున కరుగుట

  •  
  •  
  •  

10.2-1046-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని య మ్మాధవ బలదేవులు సేయు సముచిత పూజావిధానంబులం బరితృప్తులై, యమ్ముకుందు సాన్నిధ్యంబు గలిగి, తదీయ సంపద్విభవాభిరాము లై విలసిల్లుచున్న యుగ్రసేనాది యదు వృష్ణి పుంగవులం జూచి, వారలతోడ నా రాజవరులు మాధవుండు విన నిట్లనిరి.

టీకా:

కని = చూసి; ఆ = ఆ; మాధవ = కృష్ణుడు; బలదేవులు = బలరాములు; చేయు = చేసెడి; సముచిత = యుక్తము లైన; పూజా = సన్మానించెడి; విధానంబులన్ = విధానము లందు; పరితృప్తులు = సంతృప్తులు; ఐ = అయ్యి; ఆ = ఆ; ముకుందు = కృష్ణుని; సాన్నిధ్యంబున్ = సన్నిధానము; కలిగి = పొంది; తదీయ = ఆయన యొక్క; సంపత్ = సంపదల; విభవ = వైభవములచే; అభిరాములు = ఒప్పినవారు; ఐ = అయ్యి; విలసిల్లుచున్న = ప్రకాశించుచున్న; ఉగ్రసేన = ఉగ్రసేనుడు; ఆది = మున్నగు; యదు = యదువంశపు; వృష్ణి = వృష్ణివంశపు; పుంగవులన్ = శ్రేష్ఠులను; చూచి = చూసి; వారల = వారి; తోడన్ = తోటి; ఆ = ఆ; రాజ = రాజ; వరులున్ = ఉత్తములు; మాధవుండు = కృష్ణుడు; వినన్ = వినుచుండగా; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

అలా కృష్ణదర్శన కుశలులైన ఆ రాజశ్రేష్ఠులను బలకృష్ణులు కూడ సాదరంగా సత్కరించి వారికి ఎంతో ఆనందం కలిగించారు. అతని అనుగ్రహ లబ్ధ వైభవంతో ప్రకాశిస్తూ, శ్రీకృష్ణ సన్నిధిలో ఉన్న ఉగ్రసేనాది యాదవ ప్రముఖులను చూసి శ్రీకృష్ణుడికి వినపడేలా ఇలా అన్నారు.