పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శమంతకపంచకమున కరుగుట

  •  
  •  
  •  

10.2-1045-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజులు గాంచిరి నిజ
నారీయుతు లగుచు నంగనాపరివారున్,
ధీరున్, దానవకులసం
హారున్, గోపీమనోవిహారు, నుదారున్.

టీకా:

ఆ = ఆ; రాజులు = రాజులు; కాంచిరి = చూసారు; నిజ = తన; నారీ = భార్యలతో; యుతులు = కూడినవారు; అగుచున్ = ఔతు; అంగనా = భార్యలు; పరివారున్ = పరిజనులుతో నున్నవాని; ధీరున్ = ధైర్యవంతుని; దానవకులసంహారున్ = కృష్ణుని {దానవకుల సంహారుడు - రాక్షసులను సంహరించువాడు, కృష్ణుడు}; గోపీమనోవిహారున్ = కృష్ణుని {గోపీ మనోవిహారుడు - గోపికల మనస్సు లందు విహరించువాడు, కృష్ణుడు}; ఉదారున్ = గొప్పవానిని.

భావము:

ఆ రాజులు అందరూ సతీసమేతంగా వచ్చి, ప్రియకాంతా పరివారాలతో కూడి ఉన్న శ్రీకృష్ణుని, మహాధీశాలి, రాక్షస కులాంతకుని గోపికా మనోవిహారుని దర్శనం చేసుకున్నారు.