పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శమంతకపంచకమున కరుగుట

  •  
  •  
  •  

10.2-1037-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రణీశ! బలుఁడును రసిజోదరుఁడు న-
వోన్నతసుఖలీల నుండునంతఁ
టులోగ్రకల్పాంత మయమందునుఁ బో-
దృగసహ్యమై సముద్దీప్త మగుచు
రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు-
టెఱిఁగి భూజను లెల్ల రుసఁ గదలి
మును జమదగ్ని రాముఁడు పూని ముయ్యేడు-
మాఱులు ఘనబలోదారుఁ డగుచు

10.2-1037.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిజభుజాదండ మండిత నిబిడ నిశిత
టుల దంభోళిరుచిరభాస్వత్కుఠార
హితధారావినిర్భిన్న నుజపాల
దేనిర్ముక్త రుధిర ప్రవాములను.

టీకా:

ధరణీశ = రాజా; బలుండును = బలరాముడు; సరసిజోదరుడు = కృష్ణుడ; నవ = నూతనములైన; ఉన్నత = శ్రేష్ఠమైన; సుఖ = సుఖమైన; లీలన్ = విలాసముతో; ఉండునంతన్ = ఉండగా; చటుల = ముంచుకు వస్తున్న; ఉగ్ర = భయంకరమైన; కల్పాంత = ప్రళయకాల; సమయమున్ = సమయము; అందున్ = అందు; పోలెన్ = వలె; దృక్ = చూడ; అసహ్యము = సహింపరానిది; ఐ = అయ్యి; సమ = మిక్కిలి; ఉద్దీప్తము = కాంతివంత మైనది; అగుచున్ = ఔతు; రాజిల్లు = ప్రకాశించెడు; సూర్యోపరాగంబు = సూర్యగ్రహణము; చనుదెంచుటన్ = వచ్చుట; ఎఱిగి = తెలిసి; భూజనులు = ప్రజలు; ఎల్లన్ = అందరు; వరుసన్ = వరుసపెట్టి; కదలి = బయలుదేరి; మును = మునుపు; జమదగ్నిరాముడు = పరశురాముడు {జమదగ్నిరాముఁడు - జమదగ్ని యొక్క కొడుకైన రాముడు, పరశురాముడు}; పూని = పట్టుబట్టి; ముయ్యేడు = ఇరవైయొక్క (21) {ముయ్యేడు - మూడు ఏడులు, 21}; మాఱులు = సార్లు; ఘన = గొప్ప; బల = బలముచేత; ఉదారుడు = అధికముగా కలవాడు; అగుచున్ = ఔతు.
నిజ = తన; భుజాదండ = బాహులందు; మండిత = అలంకరింపబడిన; నిబిడ = దృఢమైన; నిశిత = వాడియైన; చటుల = భయంకరమైన; దంభోళి = వజ్రాయుధము; రుచిర = తేజస్సుకల; భాస్వత్ = ప్రకాశించుచున్న; కుఠార = గండ్రగొడ్డలి యొక్క; మహిత = గొప్ప; ధారా = పదునుచేత; వినిర్భిన్ = తీవ్రముగా నరకబడిన; మనుజపాల = రాజుల; దేహ = దేహములనుండి; నిర్ముక్త = విడువబడిన, స్రవిస్తున్న; రుధిర = రక్తపు; ప్రవాహములను = ఏరులచేత.

భావము:

“మహారాజా బలరామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్న రోజులలో కల్పాంత కాలంలో వలె చూడశక్యంగాని విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నారు. ప్రజలందరూ తమ వెంట రాగా వారు శమంతపంచకం అనే మహా పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే, పరశురాముడు అవక్రవిక్రమంతో అభిరాముడై ఇరవైఒక్క మార్లు దండెత్తి, వజ్రాయుధం లాంటి తన కఠోర కుఠారంతో రాజలోకం కుత్తుకలు తునిమాడు. లోకాన్ని నిఃక్షత్రం చేసాడు. ఆసమయంలో ఆ రాజుల శరీరాలనుండి స్రవించిన రక్తం ప్రవాహం కడితే....