పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కుచేలోపాఖ్యాన ప్రారంభంబు

  •  
  •  
  •  

10.2-973-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
రమశోభన మా చక్రపాణి కిపుడు
గాను కేమైనఁ గొంపోవఁ లదె మనకు? "

టీకా:

నీవు = నీవు; చెప్పిన = చెప్పిన; అట్ల = విధముగనే; రాజీవనేత్రు = కృష్ణుని; పాద = పాదములు అను; పద్మంబులన్ = పద్మములను; ఆశ్రయింపంగన్ = ఆశ్రయించుటకు; చనుట = వెళ్లుట; పరమ = మిక్కిలి; శోభనము = శుభప్రదమైనది; ఆ = ఆ దివ్యమైన; చక్రపాణి = కృష్ణుని; కిన్ = కి; ఇపుడు = ఇప్పుడు; కానుక = బహుమానము; ఏమైనన్ = ఏమైనను; కొంపోవన్ = తీసుకొని వెళ్ళుటకు; కలదె = ఏమైనా ఉందా; మన = మన; కున్ = కు (వద్ద).

భావము:

“నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని చక్రి దగ్గఱకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా.”