పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కుచేలోపాఖ్యాన ప్రారంభంబు

  •  
  •  
  •  

10.2-972-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చెప్పిన నమ్మానిని
సుయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం
నేఁగుట యిహపర సా
మగు నని మదిఁ దలంచి న సతితోడన్.

టీకా:

అని = అని; చెప్పినన్ = చెప్పగా; ఆ = ఆ; మానిని = ఉత్తమురాలు; సు = మంచి; నయ = న్యాయమైన; ఉక్తుల్ = మాటల; కున్ = కు; అలరి = సంతోషించి; భూమిసురుడు = విప్రుడు; ఆ = ఆ దివ్యమైన; కృష్ణున్ = కృష్ణుని; కనన్ = చూచుటకు; ఏగుట = వెళ్ళుట; ఇహ = ఈ లోక సుఖములు; పర = పరలోక సుఖములు; సాధనము = సాధించిపెట్టునది; అగును = అగును; అని = అని; మదిన్ = మనస్సు నందు; తలంచి = అనుకొని; తన = తన యొక్క; సతి = భార్య; తోడన్ = తోటి.

భావము:

ఇలా చెప్తున్న ఆ ఇల్లాలి మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళడం ఇహపర సాధనమని మనసులో అనుకుని, తన భార్యతో ఇలా అన్నాడు.