పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలుడు పల్వలుని వధించుట

  •  
  •  
  •  

10.2-949-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాముఁడుఁ గనుఁగొనె భార్గవ
రామున్ రజనీశ కులధరావరనగ సు
త్రామున్ సన్నుత సుగుణ
స్తోముం గారుణ్యసీము సుజనలలామున్.

టీకా:

రాముడు = బలరాముడు; కనుగొనెన్ = చూసెను; భార్గవరామున్ = పరశురాముడిని {భార్గవరాముడు - భార్గవుని కొడుకైన రాముడు, పరశురాముడు}; రజనీశ = చంద్ర {రజనీశుడు - రాత్రికి నాయకుడు, చంద్రుడు}; కుల = వంశపు; ధరావర = రాజులు అను; నగ = పర్వతములకు; సుత్రామున్ = ఇందుని వంటివాడు {సుత్రాముడు - లోకములను చక్కగా రక్షించువాడు, ఇంద్రుడు}; సన్నుత = శ్లాఘింపబడిన; సుగుణ = సుగుణముల; స్తోమున్ = సమూహము కలవానిని; కారుణ్య = దయకు; సీమున్ = మేరయైనవానిని; సుజన = సజ్జనులలో; లలామున్ = శ్రేష్ఠుని.

భావము:

ఆ మహేంద్రగిరి మీద క్షత్రియ కులాన్ని మట్టుపెట్టినవాడూ, స్తుతింపబడే సద్గుణాలు కలవాడూ, దయాశాలి, సత్ప్రవర్తక శ్రేష్ఠుడు అయిన పరశురాముడిని బలరాముడు దర్శించాడు.