పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలరాముని తీర్థయాత్ర

  •  
  •  
  •  

10.2-938-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున దుష్టదానవుం ద్రుంచుటయు మాకుం గరంబు సంతసం బగు; నంతమీఁద నీవు విమలచిత్తుండవై భారతవర్షంబునం గల తీర్థంబుల ద్వాదశమాసంబు లవగాహనంబు సేయు; మట్లయిన సర్వపాపనిష్కృతి యగు"నని పలుకునంతఁ బర్వసమాగమంబైన.

టీకా:

కావునన్ = కాబట్టి; దుష్ట = చెడ్డవాడైన; దానవున్ = రాక్షసుని; త్రుంచుటయున్ = చంపుటే; మా = మా; కున్ = కు; కరంబు = మిక్కిలి; సంతసంబు = సంతోషము; అగున్ = అగును; అంతమీద = అటుపిమ్మట; నీవు = నీవు; విమల = నిర్మలమైన; చిత్తుండవు = మనస్సు కలవాడవు; ఐ = అయ్యి; భారతవర్షంబునన్ = భారతదేశము నందు; కల = ఉన్నట్టి; తీర్థంబులన్ = పుణ్యతీర్థములను; ద్వాదశ = పన్నెండు (12); మాసంబులు = నెలలు; అవగాహంబు = దర్శించుట, స్నానములు; చేయుము = చేయుము; అట్ల = అలా; అయినన్ = అయినచో; సర్వ = సమస్తమైన; పాప = పాపములునుండి; నిష్కృతి = ప్రాయశ్చిత్తము; అగును = కలుగును; అని = అని; పలుకున్ = చెప్పిన; అంతన్ = అంతట; పర్వ = పండుగదినము; సమాగమంబు = వచ్చినది; ఐన = కాగా.

భావము:

కనుక, దుర్మార్గుడైన ఆ పల్వల రాక్షసుడిని నీవు చంపితే మా కదే సంతోషదాయకం. పిమ్మట నీవు పండ్రెండు మాసాలు నిర్మలమైన హృదయంతో భారతదేశంలో ఉన్న సకల పుణ్యతీర్ధాలను పన్నెడు (12) నెలలు సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలూ తొలగిపోతాయి.” మునులు ఇలా అంటుండగానే పర్వము రానే వచ్చింది.