పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సాళ్వుని వధించుట

  •  
  •  
  •  

10.2-910-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు కృష్ణుం డమ్మయనిర్మిత మాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఱలు వెఱికిన భుజంగంబు భంగి గండడంగి విన్ననై విగతమాయాబలుం డయ్యునుఁ బొలివోవని బీరంబున వసుధా తలంబునకు డిగ్గి యాగ్రహంబున.

టీకా:

అట్లు = ఆ విధముగా; కృష్ణుండు = కృష్ణుడు; ఆ = ఆ; మయ = మయునిచేత; నిర్మిత = తయారుచేయబడిన; మాయా = మాయలు కలిగిన; విమానంబున్ = విమానమును; నిజ = తన; గదా = గదచే; ఆహతిన్ = దెబ్బలుచేత; ఇంతింతలున్ = బాగా చిన్నవైన; తునియలు = ముక్కలు; ఐ = అయ్యి; సముద్ర = సముద్రము యొక్క; మధ్యంబునన్ = మధ్యలో; తొరగన్ = పడునట్లుగా; చేసినన్ = చేయగా; సాల్వుండు = సాల్వుడు; కోఱలు = కోరలు; పెఱికినన్ = పీకినట్టి; భుజంగంబు = పాము; భంగిన్ = వలె; గండు = మదము; అడంగి = అణగి; విన్ననై = చిన్నబోయి; విగత = పోయిన; మాయా = మాయవలని; బలుండు = బలము కలవాడు; అయ్యునున్ = అయినప్పటికి; పొలివోవని = విడువని; బీరంబునన్ = పరాక్రమముచే; వసుధాతలంబున్ = నేలపై; కున్ = కి; డిగ్గి = దిగి; ఆగ్రహంబునన్ = కోపముతో.

భావము:

ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు.