పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కృష్ణ సాళ్వ యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-894-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ళినదళాక్ష! మత్సఖుఁడు నాఁ దగు చైద్యుఁడు గోరినట్టి కో
లి నవినీతిమైఁ దగవుమాలి వరించితి; వంతఁ బోక దో
ర్బమున ధర్మనందును సభాస్థలి నేమఱి యున్న వాని న
చ్చమునఁ జంపి తట్టి కలుషంబున నేఁడు రణాంగణంబునన్.

టీకా:

నళినదళాక్షా = కృష్ణా; మత్ = నా; సఖుడు = స్నేహితుడు; నాన్ = అనగా; తగు = తగినవాడు; చైద్యుడు = శిశుపాలుడు; కోరినట్టి = అపేక్షించిన; కోమలిన్ = యువతిని; అవినీతిమై = అవినీతితో; తగవుమాలి = న్యాయముతప్పి; వరించితివి = పెండ్లాడితివి; అంతన్ = అంతటితో; పోక = విడిచిపెట్టకుండ; దోర్బలమున్ = భుజబలమున; ధర్మనందను = ధర్మరాజు; సభాస్థలిన్ = సభా యందు; ఏమఱి = పరాకుగా; ఉన్న = ఉన్నట్టి; వానిని = వాడిని; అచ్చలమునన్ = పట్టుదలతో పూని; చంపితి = చంపావు; అట్టి = అలాంటి; కలుషంబునన్ = తప్పువలన; నేడు = ఇవాళ; రణ = యుద్ధ; అంగణంబునన్ = భూమి యందు.

భావము:

“ఓ పద్మాక్షా! కృష్ణా! నా మిత్రుడు నా వాడు అయిన చైద్యరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న అతడిని పగబట్టి చంపావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో..