పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : యదు సాల్వ యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-874-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సారిథిఁ జూచి యిట్లనియె "శాత్రవవీరులు సూచి నవ్వఁగాఁ
దేరు రణక్షితిన్ వెడలఁ దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం
కేరుహనాభుఁడున్ హలియు గేలికొనన్ యదువంశసంభవుల్‌
బీము దప్పి యిప్పగిదిఁ బెల్కుఱి పోవుదురే రణంబునన్. "

టీకా:

సారథిన్ = సారథిని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను; శాత్రవ = శత్రు; వీరులు = యోధులు; చూచి = చూసి; నవ్వగాన్ = పరిహసించగా; తేరున్ = రథమును; రణ = యుద్ధ; క్షితిన్ = భూమినుండి; వెడలన్ = బయటకు; తెచ్చితి = తీసుకు వచ్చావు; తెచ్చితివి = తీసుకు వచ్చావు; దుర్యశంబున్ = అపకీర్తిని; పంకేరుహనాభుడున్ = కృష్ణుడు; హలియున్ = బలరాముడు; గేలికొనన్ = ఎగతాళిచేయగా; యదు = యాదవ; వంశ = వంశమున; సంభవుల్ = పుట్టినవారు; బీరమున్ = పరాక్రమము; తప్పి = హీనులై; ఈ = ఈ; పగిదిన్ = విధముగ; పెల్కుఱి = విహ్వలులై, బెదిరిపోయినవారై; పోవుదురే = పారిపోతారా; రణంబునన్ = యుద్ధమునుండి.

భావము:

సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.”