పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : యదు సాల్వ యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-865-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి
శ్రివర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న
ద్భుకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర
క్షితిధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా!

టీకా:

కృతవర్మ = కృతవర్మ అను; క్షితినాయకుండు = రాజు; విశిఖ = బాణముల; శ్రేణిన్ = పరంపరచేత; ప్రమత్త = మదించిన; ఆర్య = యజమానిచే; అధి = అధికముగా; శ్రిత = ఆశ్రయించబడిన; వర్మంబులన్ = కవచములను; చించి = చించి; మేనులన్ = దేహములను; శత = నూరేసి (100); ఛిద్రంబులన్ = రంధ్రములు కలవానినిగా; చేయన్ = చేయగా; అద్భుత = ఆశ్చర్యకరమైన; కర్మంబు = పని; అని = అని; సైనికుల్ = సైనికులు; పొగడన్ = కీర్తిస్తుండగా; శత్రుల్ = శత్రువులు; తూలుచోన్ = తూలిపోయిన ఎడల; సంగర = యుద్ధ; క్షితి = భూమి; ధర్మంబున్ = ధర్మమును; తలంచి = తలచి; కాచెన్ = రక్షించెను; రథిక = రథికులలో; శ్రేష్ఠుండు = ఉత్తముడు; భూమీశ్వరా = రాజా.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు.