పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : యదు సాల్వ యుద్ధంబు

  •  
  •  
  •  

10.2-863-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో
స్సా మెలర్పఁ గుంత శర క్తి గదా క్షురికాది హేతులన్
వాక వాజి దంతి రథర్గములం దునుమాడి కాల్వురన్
వీముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై.

టీకా:

సారణుడు = సారణుడు; ఏపుమై = గర్వముతో; కదిసి = చేరి; శాత్రవ = శత్రు; వీరులన్ = శూరులను; సంచలింపన్ = కలతచెందేలా; దోస్సారమున్ = భుజబలము; ఎలర్పున్ = అతిశయించగా; కుంత = ఈటెలు; శర = బాణములు; శక్తి = శక్తి ఆయుధము; గదా = గదాయుధము; క్షురికా = చురకత్తి; ఆది = మున్నగు; హేతులన్ = ఆయుధములచేత; వారక = వెనుదీయక; వాజి = గుఱ్ఱములు; దంతి = ఏనుగులు; రథ = రథములు; వర్గములన్ = సమూహములను; తునుమాడి = చంపి; కాల్వురన్ = కాల్బంటులను; వీరము = పరాక్రము; తోడన్ = తోటి; పంపెన్ = పంపించెను; జము = యముని; వీటి = పట్టణమున; కిన్ = కు; కాపురమున్ = కాపురముండుటకు; ఉగ్ర = భయకరమైన; మూర్తి = స్వరూపము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు.