పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సాల్వుండు ద్వారక న్నిరోధించుట

  •  
  •  
  •  

10.2-842-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు రౌక్మిణేయుఁ డ
జ్జముల నోడకుండుఁ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా
ములఁ బూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కే
రుచి గ్రాల నున్నతరస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్.

టీకా:

కని = చూసి; భగవంతుడున్ = మహిమాన్వితుడు; రథి = రథి {రథి - రథమునెక్కి యుద్ధము చేయు యోధుడు, (మహారథుడు - పదకొండువేలమంది (11000) విలుకాండ్రతో పోరాడెడి యోధుడు, తనను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరాడెడి యోధుడు 2)అతిరథుడు - పెక్కువిలుకాండ్రతో పోరాడెడి యొధుడు 3)సమరథుడు - ఒకవిలుకానితో సరిగనిలిచి పోరాడెడి యోధుడు 4)అర్ధరథుడు - ఒక్కవిలుకానితో పోరాడెడి యోధుడు)}; శిఖామణియున్ = ఉత్తముడు; అగు = ఐన; రౌక్మిణేయుడు = ప్రద్యుమ్నుడు {రౌక్మిణేయుడు - రుక్మిణి కొడుకు, ప్రద్యుమ్నుడు}; ఆ = ఆ; జనములన్ = ప్రజలను; ఓడక = భయపడకుండ; ఉండుడు = ఉండండి; అని = అని; సంగర = యుద్ధ; కౌతుకము = ఉత్సవము; ఒప్పన్ = కలుగగా; దివ్య = మహిమగల; సాధనములున్ = ఆయుధములను; పూని = ధరించి; సైనిక = సేనాజన; కదంబమున్ = సమూహము; కొల్వన్ = సేవించుచుండగా; అనూన = గొప్ప; మీన = చేపగుర్తుకల; కేతన = జండా యొక్క; రుచి = కాంతులు; క్రాలన్ = రెపరెపలాడుతుండగా; ఉన్నత = గొప్ప; రథ = రథము నందు; స్థితుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; వెడలెన్ = బయలుదేరెను; రణ = యుద్ధ; ఉర్వి = భూమి; కిన్ = కి.

భావము:

అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి, మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు.