పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సాల్వుండు ద్వారక న్నిరోధించుట

  •  
  •  
  •  

10.2-831.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధాత్రి నిటమీఁద వీతయావము గాఁగఁ
డఁగి సేయుదు"నని దురాగ్రహముతోడఁ
బంతములు పల్కి యటఁ జని రితనిష్ఠఁ
పము కావింపఁ బూని సుస్థలమునందు.

టీకా:

వసుధేశ = రాజా; విను = వినుము; మును = మునుపు; వైదర్భి = రుక్మణిదేవి యొక్క {వైదర్భి - విదర్భదేశ రాకుమారి, భీమకుని పుత్రిక, రుక్మిణి}; పరిణయ = వివాహ; వేళన్ = సమయమునందు; దుర్మద = మిక్కిలి కొవ్వెక్కిన; శిశుపాల = శిశుపాలుడు అను; భూమివరున్ = రాజు; కున్ = కు; తోడ్పడన్ = సహాయపడుటకు; అరుదెంచి = వచ్చి; సైనిక = సైనికుల; ఆవలి = సమూహము; తోడన్ = తోటి; తొడరి = ఎదిరించి; దోర్బలము = బాహుబలము; తూలి = పోయి; హరి = కృష్ణుని; చేత = చేత; నిర్జితులు = చనిపోయిన; రాజులు = రాజులు; లోనన్ = అందలి; చైద్యుని = శిశుపాలుని; చెలికాడు = మిత్రుడు; సాల్వ = సాల్వ దేశమునకు; భూమిపతి = రాజు; జరాసంధ = జరాసంధుడు; ఆది = మున్నగు; పార్థివ = రాజుల; ప్రకరంబు = సమూహము; వినన్ = వినుచుండగా; మత్సర = క్రోధము అను; అనల = అగ్ని యొక్క; విపుల = విస్తారమైన; శిఖలన్ = మంటలతో; ధాత్రిన్ = భూమండలమునందు; ఇటమీద = ఇకపై; వీత = పోయిన; యాదవము = యాదవులు కలది; కాగన్ = అగునట్లు; కడగి = పూని; చేయుదును = చేసెదను; అని = అని; దురాగ్రహము = చెడ్డ కోపము; తోడన్ = తోటి; పంతములు = ప్రతిజ్ఞలు; పల్కి = పలికి; అటన్ = అక్కడనుండి; చని = వెళ్ళిపోయి; భరిత = పూర్ణ; నిష్ఠన్ = నిష్ఠతో; తపమున్ = తపస్సు; కావింపన్ = చేయవలెనని; పూని = మొదలిడి; సుస్థలమున్ = మంచిప్రదేశము; అందున్ = లో.

భావము:

ఓ రాజా! రుక్మిణీ స్వయంవర సమయంలో శిశుపాలుడికి సహాయంగా సైన్యంతో సహా వచ్చి, కృష్ణుడిని ఎదిరించి, అతని చేత చావుదెబ్బలు తిని పరాజితులైన రాజులలో సాల్వుడు అనే రాజు ఒకడు. అతడు విపరీతమైన కోపంతో, మొండిపట్టుదలతో “యాదవులను అందరిని నాశనం చేస్తాను” అని జరాసంధాది రాజుల ఎదురుగా ప్రతిజ్ఞ చేసాడు. అటుపిమ్మట అతడు అత్యంత నిష్ఠతో ఒక ప్రశాంత ప్రదేశంలో ఈశ్వరుడిని గురించి తపస్సు చేయటానికి ఉపక్రమించాడు.