పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుయోధనుడు ద్రెళ్ళుట

  •  
  •  
  •  

10.2-830-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని శుకయోగీంద్రుండ
మ్మనుజేంద్రునిఁజూచి పలికె ఱియును “శ్రీకృ
ష్ణుని యద్భుత కర్మంబులు
వినిపింతుం జిత్తగింపు విమలచరిత్రా!

టీకా:

అని = అని; శుక = శుక; యోగి = ముని; ఇంద్రుండు = ఉత్తముడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మనుజేంద్రునిన్ = రాజును; చూచి = చూసి; పలికెన్ = చెప్పెను; మఱియునున్ = ఇంకను; శ్రీకృష్ణుని = కృష్ణుని; అద్భుత = ఆశ్చర్యకరములైన; కర్మంబులున్ = పనులు; వినిపింతున్ = చెప్పెదను; చిత్తగింపు = వినుము; విమలచరిత్రా = మంచి నడత కలవాడా.

భావము:

ఇలా పలికిన శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా చెప్పసాగాడు. “నిర్మలమైన చరిత్రగల ఓ రాజా పరీక్షిత్తూ! శ్రీకృష్ణుడి అద్భుత కార్యాలను ఇంకా వివరిస్తాను శ్రద్దగా ఆలకించు.