పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుయోధనుడు ద్రెళ్ళుట

  •  
  •  
  •  

10.2-829-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరబంధమోక్షణముఁ జైద్యవధంబును బాండురాజ నం
మఖరక్షణంబును నుదారతఁ జేసిన యట్టి దేవకీ
యుచరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతు రిష్ట శో
బహుపుత్త్ర కీర్తులును వ్యవివేకము విష్ణులోకమున్."

టీకా:

జనవర = రాజుల; బంధ = నిర్బందములను; మోక్షణము = విడుదల చేయుట; చైద్య = శిశుపాలుని; వధంబును = సంహరించుట; పాండురాజనందన = ధర్మరాజు; మఖ = యాగము; రక్షణంబును = కాపాడుట; ఉదారతన్ = కృపతో; చేసినయట్టి = చేసినట్టి; దేవకీతనయు = కృష్ణుని; చరిత్ర = వృత్తాంతము; భాసుర = ప్రకాశవంతమైన; కథా = కథను; పఠన = చదువు; ఆత్ములు = మనసు కలవారు; కాంతురు = పొందుతారు; ఇష్ట = కోరిన; శోభన = శుభకరములైన; బహు = పెక్కులైన; పుత్ర = కొడుకులు; కీర్తులు = యశస్సు; భవ్య = గొప్ప; వివేకము = తెలివి; విష్ణులోకమున్ = వైకుంఠము.

భావము:

రాజులను బంధవిముక్తులను చేయడం శిశుపాలుడిని వధించడం ధర్మజ్ఞుని యజ్ఞాన్ని రక్షించడం మొదలైన శ్రీకృష్ణుని విజయ గాథలను చదివినవారు కోరిన సౌభాగ్యాలనూ, కీర్తిని, దివ్యమైన జ్ఞానాన్ని వైకుంఠ వాసాన్ని పొందుతారు."