పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుయోధనుడు ద్రెళ్ళుట

  •  
  •  
  •  

10.2-826-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విధమంతయుఁ గనుఁగొని
పాని నవ్వుటయు నచటి పార్థివులునుఁ గాం
తాలియును యమతనయుఁడు
వావిరిఁ జేసన్నఁ దమ్ము వారింపంగన్.

టీకా:

ఆ = ఆ; విధము = రీతి; అంతయున్ = ఎల్ల; కనుగొని = చూసి; పావని = భీముడు; నవ్వుటయున్ = నవ్వగా; అచటి = అక్కడ ఉన్న; పార్థివులునున్ = రాజులు; కాంతా = స్త్రీల; ఆవలియును = సమూహము; యమతనయుడు = ధర్మరాజు; వావిరన్ = అధికముగ; చేసన్నన్ = చేతిసైగలచేత; తమ్మున్ = తమను; వారింపంగన్ = వారిస్తుండగా.

భావము:

ఈవిధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన భీమసేనుడు నవ్వాడు. అక్కడున్న రాజులూ స్త్రీ జనమూ ధర్మరాజు సైగ చేసి వారిస్తూ ఉన్నా...