పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-823-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాంనరత్నభూషణ నికాయముఁ దాల్చి సముజ్జ్వలప్రభో
దంచితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటఁ గ్రందువాయ వా
రిం సహోదరుల్‌ నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప నే
తెంచెను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్.

టీకా:

కాంచన = బంగారు; రత్న = రత్నాల; భూషణ = అలంకారముల; నికాయమున్ = సమూహమును; తాల్చి = ధరించి; సముజ్జ్వల = మిక్కిల కాంతివంతమైన; ప్రభా = తేజస్సుచేత; ఉదంచిత = బాగా చక్కటి; మూర్తిన్ = ఆకృతితో; ఒప్పి = ఉండి; ఫణిహారులు = ద్వారపాలకులు; ముందటన్ = ఎదుట; క్రందువాయన్ = ధ్వనిసేయుటను, సందడిని; వారించ = అడ్డుకొనుచుండగ; సహోదరుల్ = తమ్ముళ్ళు; నృప = రాజ; వరేణ్యులు = ఉత్తములు; పార్శ్వములన్ = పక్కన; భజింపన్ = సేవించగా; ఏతెంచెను = వచ్చెను; రాజసంబునన్ = రాచఠీవితో; యుధిష్ఠిరు = ధర్మరాజు; పాలి = ఒద్ద; కిన్ = కు; వైభవ = వైభవముల; ఉన్నతిన్ = అతిశయముతో.

భావము:

సువర్ణమయములైన మణిభూషణాలు ధరించి రాజసం ఉట్టిపడే తేజస్సుతో సేవకులు ముందు నడుస్తూ జనాన్ని ఒత్తిగిస్తుండగా తమ్ముళ్ళు రాజులు ఇరువైపులా చేరి అనుసరించి సేవిస్తుండగా దుర్యోధనుడు వైభవోపేతంగా ధర్మరాజు సమక్షానికి విచ్చేసాడు.