పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-822-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సు సహోదర పురోహి బాంధవామాత్య-
రిచార భటకోటి లసి కొలువఁ
లిత మాగధ మంజు గానంబుఁ బాఠక-
ఠన రవంబునుఁ బ్రమద మొసఁగఁ
గంకణ ఝణఝణత్కారంబు శోభిల్ల-
రసిజాననలు చారములిడఁగ
య వినిర్మిత సభాధ్యంబునను భాస-
మాన సింహాసనాసీనుఁ డగుచు

10.2-822.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మర గణములు గొలువఁ బెంపారు ననిమి
షేంద్రుకైవడి మెఱసి యుపేంద్రుఁ డలర
సఁ గొలువున్న యత్తఱి దుభిమాని
క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు.

టీకా:

సుత = కొడుకులు; సహోదర = తోడబుట్టినవారు; పురోహిత = పురోహితులు; బాంధవ = బంధువులు; అమాత్య = మంత్రులు; పరిచార = సేవకులు; భట = సైనికుల; కోటి = సమూహములు; బలసి = అతిశయించి; కొలువన్ = సేవించుచుండగా; కలిత = చక్కటి; మాగధ = వంశావళిచదువువారి; మంజు = మనోజ్ఞమైన; గానంబున్ = చదువుటలు; పాఠక = పాటలుపాడువారి; పఠన = పాటల; రవంబునున్ = ధ్వనులు; ప్రమదము = సంతోషమును; ఒసగన్ = కలిగిస్తుండగా; కంకణ = చేతిగాజుల; ఝణఝణత్కారంబు = గలగలధ్వనులు; శోభిల్లన్ = శోభకలిగిస్తుండగ; సరసిజాననలు = యువతులు {సరసిజాననలు - పద్మాక్షులు, స్త్రీలు}; చామరములు = వింజామరములు; ఇడగన్ = వీస్తుండగా; మయ = మయునిచేత; వినిర్మిత = చక్కగా చేయబడిన; సభా = సభకు; మధ్యంబుననున్ = నడుమ; భాసమాన = ప్రకాశించుచున్న; సింహాసన = సింహాసనముపై; ఆసీనుడు = కూర్చున్నవాడు; అగుచున్ = ఔతు; అమర = దేవతా; గణములున్ = సమూహములు; కొలువన్ = సేవిస్తుండగా; పెంపారు = అతిశయిస్తున్న; అనిమిషేంద్రున్ = దేవేంద్రుని; కైవడిన్ = వలె; మెఱసి = ప్రకాశిస్తు; ఉపేంద్రుడు = కృష్ణుడు {ఉపేంద్రుడు - ఇంద్రునితమ్ముడు,విష్ణువు}; అలరన్ = అలరారుతుండగా; సరసన్ = పక్కన; కొలువున్న = కొలువుతీరి ఉన్న; ఆ = ఆ యొక్క; తఱిన్ = సమయమునందు; దురభిమాని = మహచెడ్డ ఆహంకారముకలవాడు; క్రోధ = కోపము; మాత్సర్య = చూడనోర్వలేనిగుణము; ధనుడు = అధికముగా కలవాడు; సుయోధనుడు = దుర్యోధనుడు.

భావము:

ధర్మరాజు మయసభ మధ్యలో ప్రకాశవంతమైన సింహాసనం మీద ఆసీనుడై కొలువుతీరి ఉండగా ఆయన పుత్రులు, తమ్ముళ్ళు, పురోహితులు, బంధుమిత్రులు, మంత్రులు, సేవకులు అయనను సేవిస్తున్నారు; వందిమాగధుల మధుర స్తోత్రాలు సంతోషాన్ని కలిగిస్తున్నారు; చేతి కంకణాలు మ్రోగుతుండ యువతులు వింజామరలు వీస్తున్నారు; అప్పుడు దేవతలు సేవిస్తుండగా ప్రకాశించే దేవేంద్రుడిలాగా కొలువుతీరి ఉన్నాడు; ఇలా కొలువుతీరి ఉన్న ధర్మరాజుని వీక్షించి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ సమయంలో దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడకి వచ్చి...