పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-820-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెయు ననూనసంపదల విశ్రుతకీర్తులు మిన్ను ముట్టఁ బెం
రిన పాండుభూవరసుతాగ్రజుఁ డంతిపురంబులోన ను
జ్జ్వమణిభూషణాంశురుచిజాలము బర్వఁ బయోజనాభు ను
త్కలిక భజించుచున్ ఘనసుస్థితి భూరిమనోహరాకృతిన్.

టీకా:

వెలయు = ప్రసిద్ధమగు; అనూన = అంతులేని; సంపదలన్ = సంపదలతో; విశ్రుత = ప్రసిద్ధములైన; కీర్తులన్ = యశస్సులతో; మిన్నుముట్టన్ = మిక్కిలి సంతోషించగా; పెంపు = అతిశయముతో; అలరిన = వికాసమునొందిన; పాండుభూవరసుతాగ్రజుడు = ధర్మరాజు {పాండు భూవర సుతాగ్రజుడు - పాండురాజు పెద్ద కొడుకు, ధర్మరాజు}; అంతిపురంబు = అంతఃపురము; లోననున్ = అందు; ఉజ్జ్వల = మిక్కిల కాంతివంతమైన; మణి = మణులు పొదిగిన; భూషణ = అలంకారముల యొక్క; అంశు = కాంతికిరణాల; రుచి = ప్రకాశముల; జాలమున్ = సమూహము; పర్వన్ = వ్యాపించగా; పయోజనాభును = కృష్ణుని; ఉత్కలికన్ = ఉత్కంఠతో; భజించుచున్ = సేవిస్తు; ఘన = గొప్ప; సుఖ = సౌఖ్యవంతమైన; స్థితన్ = స్థితిలో; భూరి = గొప్ప; మనోహర = చక్కని; ఆకృతిన్ = స్వరూపముతో.

భావము:

మహదైశ్వర్యంతోనూ విశ్రుత యశస్సుతోనూ శ్రీకృష్ణుని దయవలన ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో ఉజ్వలమైన రత్నవిభూషణాల వెలుగుల మధ్య బహు మనోజ్ఞంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని సేవిస్తూ...