పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-818-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఖిల జనుల కెల్ల నానందజనకమై
యెనయు మఖము కురుకులేశ్వరునకుఁ
ర మసహ్యమైన కారణ మెయ్యది
యెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత! "

టీకా:

అఖిల = ఎల్ల; జనుల్ = ప్రజల; కున్ = కు; ఎల్లన్ = అందరు; ఆనంద = ఆనందము; జనకము = కలిగించునది; ఐ = అయ్యి; ఎనయు = పొందికగల; మఖమున్ = యాగము; కురుకులేశ్వరున్ = దుర్యోధనున {కురుకులేశ్వరుడు - కురు వంశమునందలి ప్రభువు, దుర్యోధనుడు}; కున్ = కు; కరము = మిక్కిలి; అసహ్యము = సహింపరానిది; ఐన = ఐనట్టి; కారణము = కారణము; ఎయ్యది = ఏమిటి; ఎఱుగన్ = తెలియునట్లు; పలుకు = చెప్పుము; నా = నా; కున్ = కు; ఇద్ధచరిత = శ్లాఘనీయవర్తనుడ.

భావము:

“ఓ మహానుభావ! అందరికీ సంతోషాన్ని కలిగించే రాజసూయ యాగం దుర్యోధనుడికి ఎందుకని సహింపరానిది అయిందో నాకు వివరంగా చెప్పు.”