పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-814-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వర! పాండుభూపతనుజాతుఁడు దుస్తరమౌ మనోరథా
బ్ధిని సరసీరుహాక్షుఁ డను తెప్ప కతంబున దాఁటి భూరి శో
యుతుఁడై మనోరుజయుఁ బాసి ముదాత్మకుఁడై వెలింగె, న
వ్వరుహనాభుదాసజనర్యులకుం గలవే యసాధ్యముల్‌?

టీకా:

జనవర = పరీక్షిన్మహారాజా; పాండుభూపతనుజాతుడు = ధర్మరాజు; దుస్తరము = దాటరానిది; ఔ = అగు; మనోరథ = కోరికలు అను; అబ్ధిని = సముద్రమును; సరసీరుహాక్షుడు = కృష్ణుడు; అను = అనెడి; తెప్ప = పడవ; కతంబునన్ = సహాయముచేత; దాటి = తరించి; భూరి = అత్యధికమైన; శోభన = శుభములతో; యుతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; మనోరుజయున్ = మనోవ్యథలను; పాసి = విడిచి; ముద = సంతోషించిన; ఆత్ముడు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; వెలింగెన్ = ప్రకాశించెను; ఆ = ఆ దివ్యమైన; వనరుహనాభు = కృష్ణుని; దాస = భక్తులైన; జన = వారిలో; వర్యుల్ = శ్రేష్ఠుల; కున్ = కు; కలవే = ఉన్నాయా, లేవు; అసాధ్యముల్ = అసాధ్యమైనవి.

భావము:

“మహారాజా! రాజసూయం చేయాలనే బహు దుష్కరమైన సముద్రమంతటి తన కోరికను ధర్మరాజు కృష్ణుడనే ఓడ ద్వారా దాటి, మానసికవ్యధ నుండి దూరమై గొప్పఐశ్వర్యంతో సంతోషంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడి భక్తులకు సాధ్యం కానిది ఏముంది?