పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-813-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పాండవాగ్రజుప్రార్థనం గైకొని దామోదరుండు సమస్త యాదవులనుఁ గుశస్థలికిఁ బోవంబనిచి కతిపయ పరిజనంబులుం దానును నతనికిఁ బ్రియంబుగాఁ దన్నగరంబునఁ బ్రమోదంబున నుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; పాండవాగ్రజున్ = ధర్మరాజు యొక్క; ప్రార్థనన్ = వేడికోలును; కైకొని = అంగీకరించి; దామోదరుండు = కృష్ణుడు; సమస్త = ఎల్ల; యాదవులనున్ = యాదవులను; కుశస్థలి = కుశస్థలి; కిన్ = కి; పోవన్ = వెళ్ళుటకు; పనిచి = పంపించి; కతిపయి = కొద్దిమంది; పరిజనంబులున్ = సేవకులు; తానునున్ = తాను; అతని = అతని; కిన్ = కి; ప్రియంబుగా = ప్రీతికరముగా; తత్ = ఆ; నగరంబునన్ = నగరమునందు; ప్రమోదంబునన్ = సంతోషముతో; ఉండెన్ = ఉండెను; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా ధర్మరాజు చేసిన విన్నపం శ్రీకృష్ణుడు మన్నించాడు. యాదవులను అందరినీ కుశస్థలికి పంపించాడు. తాను మాత్రం కొంత పరివారంతో ధర్మరాజు తృప్తిచెందే దాక ఇంద్రప్రస్థనగరంలోనే సంతోషంగా ఉన్నాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు.