పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-812-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిచరణాంబుజాతయుగళార్చకుఁడై పెనుపొందు పాండుభూ
సుత రాజసూయమఖ వైభవమున్ నుతియించుచున్, సమా
మున నాత్మభూముల కుదారత నేఁగిరి; ధర్మసూనుఁడున్
సిజనేత్రుఁ దా ననుపఁజాలక యుండు మటంచు వేఁడినన్.

టీకా:

హరి = కృష్ణుని; చరణ = పాదములు అను; అంబుజాత = పద్మముల; యుగళ = జంటను; అర్చకుడు = పూజించువారు; ఐ = అయ్యి; పెనుపొందు = అతిశయించెడి; పాండుభూవరసుత = ధర్మరాజు యొక్క {పాండు భూవర సుతుడు - పాండురాజు యొక్క కొడుకు, ధర్మరాజు}; రాజసూయ = రాజసూయము అను; మఖ = యజ్ఞము యొక్క; వైభవమున్ = వైభవమును; నుతియించుచున్ = స్తుతించుచు; సమ = మిక్కిలి; ఆదరమునన్ = ఆదరముతో; ఆత్మ = తమ; భూములు = దేశముల; కున్ = కు; ఉదారతన్ = గౌరవముతో; ఏగిరి = వెళ్ళిపోయారు; ధర్మసూనుండును = ధర్మరాజు; సరసిజనేత్రున్ = కృష్ణుని; తాన్ = తాను; అనుపజాలక = పంపించలేక; ఉండుము = వెళ్ళవద్దు; అంచున్ = అనుచూ; వేడినన్ = ప్రార్థించగా.

భావము:

యజ్ఞానికి విచ్చేసిన వారంతా శ్రీకృష్ణభక్తుడు పాండురాజ సుతుడు అయిన ధర్మరాజు కావించిన రాజసూయ యాగం వైభవాన్ని పొగుడుతూ తమ తమ స్థలాలకు వెళ్ళారు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని వదలలేక ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు.