పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-810-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు నారాయణపరాయణులై దేవసమాన ప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ఘ్యరత్నమయభూషణ మాల్యానులేపనంబులు ధరించి పరమానంద భరితాత్ములై యెప్పియుండి; రంత.

టీకా:

అట్లు = ఆ విధముగా; నారాయణ = కృష్ణుని యందు; పరాయణులు = లగ్నమైన మనసులు కలవారు; ఐ = అయ్యి; దేవ = దేవతలతో; సమాన = సమానమైన; ప్రకాశ = ప్రకాశముతో; ప్రభావంబులన్ = వైభవములతో; సకల = ఎల్ల; నర = పురుషులు; నారీ = స్త్రీల; లోకంబులు = సమూహములు; అనర్ఘ్య = వెలకట్టలేని; రత్న = రత్నాలు; మయ = పొదిగిన; భూషణ = ఆభరణములు; మాల్య = పూలదండలు; అనులేపనంబులున్ = మైపూతలు; ధరించి = ధరించి; పరమ = మిక్కిలి; ఆనంద = ఆనందముచేత; భరిత = నిండినట్టి; ఆత్ములు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; ఒప్పి = చక్కా అయ్యి; ఉండిరి = ఉన్నారు; అంతన్ = అంతట;

భావము:

ఆ విధంగా మిక్కిలి విలువైన రత్నమయభూషణాలు గంధమాల్యాదులు ధరించి, దేవతలలా ప్రకాశిస్తూ, నారాయణపరాయణులై నగరంలోని స్త్రీపురుషులు అందరూ ఆనందంగా ఉన్నారు.