పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-809-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాండుతనూభవాగ్రజుఁడు, పాండుయశోనిధి, భాసమాన మా
ర్తాంనిభుండు యాజక, సస్య, మహీసుర, మిత్ర, బంధు, రా
ణ్మంలిఁ బూజ సేసి బుధమాన్యచరిత్రుడు వారి కిచ్చెనొం
డొం దుకూలరత్న కనకోజ్జ్వలభూషణముఖ్యవస్తువుల్‌.

టీకా:

పాండుతనూభవాగ్రజుఁడు = పాండురాజు తనయులలో అగ్రజుడు అయిన ధర్మరాజు; పాండు = తెల్లని, స్వచ్ఛమైన; యశః = కీర్తికి; నిధి = ఉనికిపట్టైనవాడు; భాసమాన = ప్రకాశించుచున్న; మార్తాండ = సూర్యునితో; నిభుండు = సమానుడు; యాజక = ఋత్విక్కుల; సదస్య = యజ్ఞకార్య పరీక్షకుల; మహీసుర = బ్రాహ్మణుల; మిత్ర = స్నేహితుల; బంధు = బంధువుల; రాట్ = రాజుల; మండలిన్ = సమూహమును; పూజ = సన్మానించుట; చేసి = చేసి; బుధ = విఙ్ఞులచేత; మాన్య = గౌరవింపబడు; చరిత్రుడు = నడవడిక కలవాడు; వారి = వారల; కిన్ = కు; ఇచ్చెన్ = ఇచ్చెను; ఒండొండ = ఒక్కొక్కరికి; దుకూల = స్వచ్ఛమైన బట్టలు; రత్న = రత్నములు; కనక = బంగారముచేత; ఉజ్జ్వల = మిక్కిలి ప్రకాశించుచున్న; భూషణ = ఆభరణములు; ముఖ్య = మున్నగు; వస్తువుల్ = వస్తువులను.

భావము:

యజ్ఞం చేయించిన వారిని యజ్ఞ కార్యాన్ని పర్యవేక్షించిన వారినీ సభాసదులైన బ్రాహ్మణులను, బంధుమిత్రులను, రాజులను పాడవులలో అగ్రజుడు, నిర్మలయశస్వి, సూర్య తేజోవంతుడు, పండితమాన్యుడు అయిన ధర్మరాజు సత్కరించాడు. వారందరికీ పట్టువస్త్రాలు, సువర్ణ రత్న భూషణాలు మున్నగువాటిని బహుమానంగా ఇచ్చాడు.