పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట

  •  
  •  
  •  

10.2-786-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘోషసుతుఁడు దద్విభ
ము సూచి సహింప కలుక ట్రిలఁగా బీ
ము డిగ్గి నిలిచి నిజ హ
స్తము లెత్తి మనోభయంబు క్కినవాఁడై.

టీకా:

దమఘోషసుతుడు = శిశుపాలుడు {దమఘోష సుతుడు - దమఘోషుని (కృష్ణుని మేనత్త శ్రుతశ్రవసల) కొడుకు, శిశుపాలుడు}; తత్ = ఆ; విభవము = వైభవమును; చూచి = చూసి; సహింపక = సహించలేక; అలుకన్ = కోపము; వట్రిలగన్ = కలుగగా; పీఠమున్ = పీఠమును; డిగ్గి = దిగి; నిలిచి = నిలబడి; నిజ = తన; హస్తములు = చేతులు; ఎత్తి = పైకెత్తి; మనః = మనసు నందు; భయంబున్ = భయము; తక్కినవాడు = తొలగినవాడు, లేనివాడు; ఐ = అయ్యి.

భావము:

అంతలో, కృష్ణుని మేనత్త శ్రుతశ్రవస, చేది దేశ రాజు దమఘోషుల కుమారుడైన శిశుపాలుడు ఆ వైభవాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అసూయతో మనసులోని భయాన్ని వీడి తన చేతులెత్తి ఆసనం దిగి, నిలబడి...