పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట

  •  
  •  
  •  

10.2-782-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిజనమానసమధుకర
జాతములైన యట్టి వారిజదళలో
ను పదయుగళప్రక్షా
మొగిఁ గావించి తజ్జలంబులు భక్తిన్.

టీకా:

ముని = మునులు; జన = ఎల్లరి; మానస = అంతరంగములు అను; మధుకర = తుమ్మెదలకు; వనజాతములు = తామరలు; ఐన = అయిన; అట్టి = అటువంటి; వారిజదళలోచనున్ = కృష్ణుని; పద = పాదముల; యుగళ = జంటను; ప్రక్షాళనము = కడుగుట; ఒగిన్ = క్రమముగా; కావించి = చేసి; తత్ = ఆ; జలంబులున్ = నీళ్ళను; భక్తిన్ = భక్తితో.

భావము:

మహామునుల మనస్సులు అనే తుమ్మెదలకు పద్మాలవంటి వైన కలువరేకులు వంటి కన్నులు కల శ్రీకృష్ణుని పాదాలు రెండూ భక్తితో కడిగి, ఆ జలాన్ని...