పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట

  •  
  •  
  •  

10.2-781-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని సహదేవుఁడు పలికిన
విని యచ్చటి జనులు మనుజవిభులును ఋషులున్
మునుకొని మనములు మోదము
నుకఁగ నిది లెస్స యనిరి ర్మజుఁ డంతన్.

టీకా:

అని = అని; సహదేవుడు = సహదేవుడు; పలికినన్ = చెప్పగా; విని = విని; అచ్చటి = అక్కడున్న; జనులు = వారు; మనుజవిభులు = రాజులు; ఋషులున్ = మునులు; మునుకొని = ఒప్పుకొని; మనములున్ = మనస్సులు; మోదమున్ = సంతోషముతో; తనుకగన్ = కలుగగా; ఇది = ఇది; లెస్స = సరైనది; అనిరి = అన్నారు; ధర్మజుడు = ధర్మరాజు; అంతన్ = అటుపిమ్మట.

భావము:

అని సహదేవుడు చెప్పగా ఆ సభాసదులు, రాజులు, ఋషులు మొదలైన వారందరూ సంతోషంతో “ఇదే సముచిత మైనది” అని అంగీకరించారు. అప్పుడు ధర్మరాజు.....