పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట

  •  
  •  
  •  

10.2-768-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి సవనభూమిఁ నకలాంగలముల
ర్థి దున్ని పాండవాగ్రజునకు
చట దీక్షచేసి యంచితస్వర్ణ మ
యోపకరణముల నలోపముగను,

టీకా:

కడగి = ప్రారంభించి; సవన = యజ్ఞ; భూమిన్ = భూమిని; కనక = బంగారు; లాంగలములన్ = నాగళ్ళతో; అర్థిన్ = అక్కరతో; దున్ని = దున్ని; పాండవాగ్రజున్ = ధర్మరాజున {పాండవాగ్రజుడు - పంచపాండవులలోను పెద్దవాడు, ధర్మరాజు}; కున్ = కు; అచటన్ = అక్కడ; దీక్ష = దీక్షతీసుకొన్నవానిగా; చేసి = చేసి; అంచిత = చక్కటి; స్వర్ణ = బంగారముతో; మయ = చేసిన; ఉపకరణములన్ = సాధనములతో; అలోపముగన్ = లోపము లేకుండ.

భావము:

పూని యజ్ఞభూమిని బంగారునాగళ్ళతో దున్నించి, సువర్ణమయమైన పరికారాలతో ఏలోపం రాకుండా పంచపాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు యజ్ఞదీక్ష ఇచ్చారు.