పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట

  •  
  •  
  •  

10.2-766-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాత్యవతేయ, కశ్యప, భరద్వాజోప-
హూతి, విశ్వామిత్ర, వీతిహోత్ర,
మైత్రేయ, పైల, సుమంతు, మధుచ్ఛంద,-
గౌతమ, సుమతి, భార్గవ, వసిష్ఠ,
వామదేవాకృతవ్రణ, కణ్వ, జైమిని,-
ధౌమ్య, పరాశరార్వ, కవషు,
సిత, వైశంపాయ, నాసురి, దుర్వాస,-
క్రతు, వీరసేన, గర్గ, త్రికవ్య,

10.2-766.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముఖ్యులైన పరమమునులను, గృపుని, గాం
గేయ, కుంభజాంబికేయ, విదుర,
కురుకుమార, బంధు, కులవృద్ధ, ధారుణీ
సుర, నరేంద్ర, వైశ్య, శూద్రవరుల.

టీకా:

సాత్యవతేయ = వ్యాసుడు {సాత్యవతేయుడు - సత్యవతి యొక్క కొడుకు, వ్యాసుడు}; కశ్యప = కశ్యపుడు; భరద్వాజ = భరద్వాజుడు; ఉపహూతి = ఉపహూతి; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; వీతిహోత్ర = వీతిహోత్రుడు; మైత్రేయ = మైత్రేయుడు; పైల = పైలుడు; సుమంతు = సుమంతుడు; మధుచ్ఛంద = మధుచ్ఛందుడు; గౌతమ = గౌతముడు; సుమతి = సుమతి; భార్గవ = భార్గవుడు; వసిష్ఠ = వసిష్ఠుడు; వామదేవ = వామదేవుడు; అకృతవ్రణ = అకృతవ్రణుడు; కణ్వ = కణ్వుడు; జైమిని = జైమిని; ధౌమ్య = ధౌమ్యుడు; పరాశర = పరాశరుడు; అధర్వ = అధర్వుడు; కవషు = కవషుడు; లసిత = లసితుడు; వైశంపాయన = వైశంపాయనుడు; ఆసురి = ఆసురి; దుర్వాస = దుర్వాసుడు; క్రతు = క్రతువు; వీరసేన = వీరసేనుడు; గర్గ = గర్గుడు; త్రికవ్య = త్రికవ్యుడు; ముఖ్యులైన = మొదలైన; పరమ = ఉత్తములైన; మునులనున్ = ఋషులను {ముని - ఙ్ఞానముచేత మౌనము వహించినవాడు}; కృపుని = కృపాచార్యుడు; గాంగేయ = భీష్ముడు {గాంగేయుడు - గంగయొక్క కుమారుడు, భీష్ముడు}; కుంభజ = ద్రోణుడు {కుంభజుడు - కుంభమున జన్మించిన వాడు, ద్రోణుడు}; ఆంబికేయ = ధృతరాష్ట్రుడు {ఆంబికేయుడు - వ్యు. అంబికాయాః అపత్యమ్‌-అంబికా + ఢక్‌. (త.ప్ర.). ఆంధ్రశబ్దరత్నాకరం, అంబికయొక్క పుత్రుడు, ధృతరాష్ట్రుడు}; విదుర = విదురుడు; కురుకుమార = దుర్యోధనుడు; బంధు = బంధువులు; కులవృద్ధ = కులపెద్దలు; ధారుణీసుర = బ్రాహ్మణులు; నరేంద్ర = రాజోత్తమ; వైశ్య = వైశ్యులు; శూద్ర = శూద్రులులోని; వరులన్ = శ్రేష్ఠులను.

భావము:

సత్యవతీ కుమారుడు వేదవ్యాసుడు, కశ్యపుడు, ఉపహూతి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీతిహోత్రుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, మధుచ్ఛందుడు, గౌతముడు, సుమతి, భార్గవుడు, వసిష్ఠుడు, వామదేవుడు, అకృతవ్రణుడు, కణ్వుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, అధర్వుడు, కవషులు, అసితుడు, వైశంపాయనుడు, ఆసురి, దుర్వాసుడు, క్రతువు, వీరసేనుడు, గర్గుడు, త్రికవ్యుడు మొదలైన మునీశ్వరులనూ; ద్రోణుడు, కృపాచార్యుడు ఆది గురువులనూ; భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మున్నగు కురువృద్ధులనూ; దుర్యోధనాది బంధుజనాన్నీ; అలా గురు బంధు మిత్ర కులవృద్ధులను అందరినీ, సమస్త బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ముఖ్యులనూ; ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించాడు.