పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

  •  
  •  
  •  

10.2-757-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మీలు ధర్మముం దగవు మేరయుఁ దప్పక, భూజనాళిఁ బెం
పారుచు, సౌఖ్యసంపదల నందఁగఁ బ్రోచుచు, భూరియజ్ఞముల్‌
గౌవవృత్తి మత్పరముగా నొనరింపుచు, మామకాంఘ్రి పం
కేరుహముల్‌ భజించుచు నకిల్బిషులై చరియింపుఁ డిమ్ములన్.

టీకా:

మీరలు = మీరు; ధర్మమున్ = ధర్మమును; తగవు = న్యాయము; మేరయున్ = మర్యాదలు; తప్పక = తప్పకుండా; భూజన = ప్రజలను {భూజనులు - భూ (రాజ్యము నందలి) జనులు, ప్రజలు}; ఆళిన్ = సమూహమును; పెంపారుచున్ = అతిశయించుచు; సౌఖ్య = సుఖములు; సంపదలన్ = కలుములు; అందగన్ = చెందునట్లు; ప్రోచుచున్ = కాపాడుతు; భూరి = పెద్ద; యజ్ఞముల్ = యాగములను; గౌరవ = గౌరవవంతమైన; వృత్తిన్ = విధానములతో; మత్ = నాకు; పరముగాన్ = చెందునట్లుగా; ఒనరింపుచు = చేస్తూ; మామక = మా యొక్క; అంఘ్రి = పాదములు అను; పంకేరుహముల్ = పద్మములను; భజించుచున్ = సేవించుచు; అకిల్బిషులు = పాపములు లేనివారు; ఐ = అయ్యి; చరియింపుడు = వర్తించండి; ఇమ్ములన్ = చక్కగా.

భావము:

మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి.