పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

  •  
  •  
  •  

10.2-754-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని తను శరణము వేఁడిన
నాథుల వలను సూచి దమలభక్తా
చరితుఁడు పంకజలో
నుఁ డిట్లను వారితోడ దయామతియై.

టీకా:

అని = అని; తను = తనను; శరణము = రక్షకము; వేడిన = కోరినట్టి; జననాథుల = రాజుల; వలను = వైపు; చూచి = చూసి; సత్ = మిక్కిలి; అమల = నిర్మలమైన; భక్త = భక్తులను; ఆవన = కాపాడెడి; చరితుడు = వర్తన కలవాడు; పంకజలోచనుడు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; అనున్ = అనెను; వారి = వారల; తోడన్ = తోటి; సదయా = కృప గల; మతి = మనస్సు కలవాడు; ఐ = అయ్యి.

భావము:

భక్తజనావాసుడైన పద్మలోచనుడు దయతో కూడినవాడై, తనను శరణుకోరుతున్న ఆ రాజులకు ఇలా చెప్పాడు.