పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

  •  
  •  
  •  

10.2-748-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రితముదాత్ములై, విగతబంధనులై, నిజమస్తముల్‌ మురా
సురిపు పాదపద్మములు సోఁకఁగఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై,
ములు మోడ్చి "యో! పరమకారుణికోత్తమ! సజ్జనార్తి సం
ణ వివేకశీల! మహితాశ్రితపోషణ! పాపశోషణా!

టీకా:

భరిత = నిండు; ముద = సంతోషించిన; ఆత్ములు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; విగత = పోయిన; బంధనులు = నిర్భంధములు కలవారు; ఐ = అయ్యి; నిజ = తమ; మస్తముల్ = తలలు; మురాసురరిపు = కృష్ణుని; పాద = పాదములు అను; పద్మములు = పద్మములు; సోకగన్ = తాకునట్లుగా; జాగిలి = సాగిలపడి; మ్రొక్కి = నమస్కరించి; నమ్రులు = అణకువ కలవారు; ఐ = అయ్యి; కరములు = చేతులు; మోడ్చి = జోడించి; ఓ = ఓ; పరమ = ఉత్కృష్టమైన; కారుణిక = దయ కలవారిలో; ఉత్తమ = ఉత్తముడా; సజ్జన = సత్పురుషుల; ఆర్తిన్ = దుఃఖమును; సంహరణ = పోగొట్టువాడ; వివేక = ఉచితానుచిత పరిఙ్ఞానము కల; శీల = నడవడి కలవాడా; మహిత = గొప్పవాడ; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; పోషణ = ప్రోచువాడ; పాప = పాపములను; శోషణా = ఆవిరి చేయువాడ.

భావము:

బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు. కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా ఇలా స్తుతించారు. “ఓ దయామయా! సజ్జనుల దుఃఖాలను పోగొట్టేవాడా! ఆశ్రితరక్షకా! దురిత నివారణ!