పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

  •  
  •  
  •  

10.2-745-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధాధినాథునకు ము
న్నపడి చెఱసాలలను మహాదుఃఖములన్
నొగులుచుఁ దన పాదాంబుజ
యుళము చింతించుచున్న యుర్వీశ్వరులన్.

టీకా:

మగధాధినాథున్ = జరాసంధుని; కున్ = కి; మున్ను = మునుపు; అగపడి = చిక్కి; చెఱసాలలను = కారాగారములలో; మహా = మిక్కుటమైన; దుఃఖములన్ = దుఃఖము లందు; నొగులుచున్ = బాధపడుతు; తన = తన యొక్క; పాద = పాదములు అను; అంబుజ = పద్మముల; యుగళమున్ = జంటను; చింతించుచున్న = ధ్యానిస్తున్న; ఉర్వీశ్వరులన్ = రాజులను.

భావము:

జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ (విడిపించాడు)