పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

  •  
  •  
  •  

10.2-743-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిలజుని దేవపతి నం
నుఁడునుఁ బద్మాక్షుఁడును నుదారత నాలిం
ములు సేసి పరాక్రమ
ము కద్భుతమంది మోదమునఁ బొగడి రొగిన్.

టీకా:

అనిలజుని = భీముని {అనిల జుడు - అనిల (వాయు) జుడు (పుత్రుడు), భీముడు}; దేవపతినందనుడునున్ = అర్జునుడు {దేవపతి నందనుడు - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు}; పద్మాక్షుడునున్ = కృష్ణుడు; ఉదారతన్ = మెచ్చుకోలుగా; ఆలింగనములు = కౌగలించుకొనుటలు; చేసి = చేసి; పరాక్రమమునకు = పరాక్రమమునకు; అద్భుతము = అబ్బుర; అంది = పడి; మోదమునన్ = సంతోషముతో; పొగడిరి = శ్లాఘించిరి; ఒగిన్ = వరసపెట్టి.

భావము:

జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు.