పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : జరాసంధుని వధింపఁ బోవుట

  •  
  •  
  •  

10.2-725-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర
లులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని
మున్ను సెప్ప వినమె? న్నుతచరితులు
న్న నైన నేఁడు నున్నవారు. "

టీకా:

ధీర = స్వతంత్రమైన; మతులు = బుద్ధి కలవారు; రంతిదేవ = రంతిదేవుడు; హరిశ్చంద్ర = హరిశ్చంద్రుడు; బలులు = బలిచక్రవర్తులు; ఉంఛవృత్తిన్ = బిచ్చమెత్తు కొను జీవనము కల; బ్రాహ్మణునిని = విప్రుని (గురించి); మున్ను = మునుపు; చెప్ప = చెప్పగా; వినమె = వినలేదా, విన్నాము కదా; సన్నుత = కొనియాడదగిన; చరితులు = నడవడికలు కలవారు; సన్నన = చనిపోయివారు, తక్కువమంది; ఐనన్ = అయినప్పటికి; నేడున్ = ఇవాళకూడ; ఉన్నవారు = ఉన్నారు.

భావము:

మహా ధీరులు అయిన రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, బిచ్చమెత్తుకుని జీవించే బ్రాహ్మణుడు సక్తుప్రస్థుడు మున్నగువారి గురించి చెప్పుకోవటం పూర్వం నుంచీ వింటున్నాం కదా. స్తుతిపాత్రమైన చరితార్థులు ఆ మహనీయులు ఎప్పుడో మరణించినా, ఈనాటికీ బ్రతికి ఉన్నవారే.”