పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : దిగ్విజయంబు

  •  
  •  
  •  

10.2-707-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను మాటలు విని కుంతీ
యుఁడు మోదమునఁ బొంగి తామరసాక్షున్
వినుతించి శౌర్యకలితుల
నుజుల దెసఁ జూచి పలికె ర్షముతోడన్.

టీకా:

అను = అనెడి; మాటలు = మాటలను; విని = విని; కుంతీతనయుడు = ధర్మరాజు; మోదమునన్ = సంతోషముతో; పొంగి = అతిశయించి; తామరసాక్షున్ = కృష్ణుని; వినుతించి = స్తుతించి; శౌర్య = వీరత్వము; కలితులన్ = కలవారిని; అనుజుల = తమ్ముళ్ళ; దెసన్ = వైపు; చూచి = చూసి; పలికెన్ = చెప్పెను; హర్షము = సంతోషము; తోడన్ = తోటి.

భావము:

ఈవిధంగా పలికిన శ్రీకృష్ణుడి మాటలు వినిన ధర్మజుడు ఎంతో సంతోషించి, పద్మాక్షుడిని ప్రస్తుతించాడు. మహాపరాక్రమవంతులైన తన సహోదరులతో ఉత్సాహంగా ఇలా అన్నాడు.