పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : దిగ్విజయంబు

  •  
  •  
  •  

10.2-699-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ గొల్తురు భక్తి నిష్ఠులై,
యెవ్వరు నిన్నుఁ బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై,
వ్విమలాత్ము లందుదు రుదంచితశోభన నిత్యసౌఖ్యముల్‌
నివ్వటిలంగఁ గృష్ణ! నిను నేర్చి భజించిన రిత్తవోవునే! "

టీకా:

ఎవ్వరు = ఎవరైతే; నీ = నీ యొక్క; పద = పాదములు అను; అంబుజములున్ = పద్మములను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; కొల్తురు = సేవింతురో; భక్తి = భక్తియందు; నిష్ఠులు = అనన్యమైన దీక్ష కలవారు; ఐ = అయ్యి; ఎవ్వరున్ = ఎవరైతే; నిన్నున్ = నిన్ను; ప్రేమన్ = ప్రేమతో; నుతియింతురు = స్తుతించెదరో; భూరి = ఉత్కృష్ఠమైన; వివేకశాలురు = వివేకము కలవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; విమల = పరిశుద్ధమైన; ఆత్ములు = మనసుకలవారు; అందుదురు = పొందగలరు; ఉదంచిత = మిక్కిలి చక్కనైన; శోభన = శుభకరమైన; నిత్య = శాశ్వతములైన; సౌఖ్యముల్ = సుఖములను; నివ్వటిలంగన్ = అతిశయించునట్లుగా; కృష్ణ = కృష్ణా; నిను = నిన్ను; నేర్చి = నేర్పు కలిగి; భజించినన్ = సేవించినచో; రిత్తపోవునే = వ్యర్థ మగునా, కాదు.

భావము:

కృష్ణా! భక్తితో నీ పాదపద్మాలను ధ్యానించే వారు, మంచి బుద్ధిమంతులై నిన్ను ప్రేమతో సన్నుతించు వారు సదా సుఖసంతోషాలను పొందుతారు. నిన్ను శ్రద్దగా పూజించటం ఎన్నటికీ వ్యర్థంకాదు కదా.”