పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట

  •  
  •  
  •  

10.2-685-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిరాక యెఱిఁగి ధర్మజు
లేని ముదంబుతోడ నుజులు బంధుల్‌
గురుజన సచివ పురోహిత
రిచారక కరి రథాశ్వ టయుతుఁ డగుచున్.

టీకా:

హరి = కృష్ణుడు; రాక = వచ్చుట; ఎఱిగి = తెలిసికొని; ధర్మజుడు = ధర్మరాజు; అఱలేని = అంతులేని; ముదంబు = సంతోషము; తోడన్ = తోటి; అనుజులు = సోదరులు, తమ్ముళ్ళు; బంధుల్ = బంధువులు; గురు = పెద్ద; జన = వారు; సచివ = మంత్రులు; పురోహిత = పురోహితులు; పరిచారక = సేవకులు; కరి = ఏనుగులు; రథ = రథములు; అశ్వ = గుఱ్ఱములు; భట = సైనికులుతో; యుతుడు = కూడినవాడు; అగుచున్ = ఔతు.

భావము:

శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మఱియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగబలాల సమేతంగా బయలుదేరాడు.