పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు

  •  
  •  
  •  

10.2-684-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర మరుదేశంబులు దాటి యిందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీనది దాఁటి పాంచాల మత్స్యవిషయంబులు లోనుగాఁ గడచి యింద్ర ప్రస్థనగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన.

టీకా:

ఇట్లు = ఇలా; గడచి = దాటి; చనుచున్ = పోతూ; ఆనర్తక = ఆనర్తకము; సౌవీర = సౌవీరము; మరుత్ = మరుత్తు; దేశంబులున్ = దేశముములను; దాటి = అతిక్రమించి; ఇందుమతిని = ఇందుమతీనదిని; దర్శించి = చూసి; దృషద్వతి = దృషద్వతీనదిని; ఉత్తరించి = దాటి; సరస్వతీనదిన్ = సరస్వతీనదిని; దాటి = దాటి; పాంచాల = పాంచాలము; మత్స్య = మత్స్యము; విషయంబులున్ = దేశములు; లోనుగాన్ = మొదలగువానిని; కడచి = దాటి; ఇంద్రప్రస్థ = ఇంద్రప్రస్థము అను; నగరంబున్ = పట్టణమును; డాయన్ = దగ్గరకు; చని = వెళ్ళి; తత్ = ఆ; పుర = పట్టణము యొక్క; ఉపకంఠ = సమీపము నందలి; వనంబునన్ = తోట నందు; విడిసిన = విడిదిచేయగా.

భావము:

ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి; ఇందుమతీనదిని దర్శించి; దృషద్వతీ, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి; ఇంద్రప్రస్థ నగరం చేరి, ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేసాడు.