పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు

  •  
  •  
  •  

10.2-683-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి హరి రథ సుభట సము
త్కములు సేవింప మురవిదారుఁడు గడచెన్
రి దుపవన దుర్గ సరో
జనపద పుర పుళింద న గోష్ఠములన్.

టీకా:

కరి = ఏనుగులు; హరి = గుఱ్ఱములు; రథ = రథములు; సుభట = వీరుల; సముత్కరములు = సమూహములు; సేవింపన్ = కొలుస్తుండగా; మురవిదారుడు = కృష్ణుడు; కడచెన్ = దాటెను; సరిత్ = సెలయేర్లు; ఉపవన = తోటలు; దుర్గ = కోటలు; సరోవర = సరస్సు; జనపద = ఊర్లు; పుర = పురములు; పుళింద = బోయగూడెములు; వన = అడవులు; గోష్ఠములన్ = పశువు లుంచు చోటులను.

భావము:

ఈవిధంగా మురాసురసంహారుడు శ్రీకృష్ణుడు రథ, గజ, తురగ, పదాతిసేనా సమూహాలు గల చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా నదులనూ, వనాలనూ, కోటలనూ, జలాశయాలనూ, గ్రామాలనూ, పట్టణాలనూ, భిల్లపల్లెలను, తపోవనాలను, గోష్ఠాలను దాటాడు.