పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు

  •  
  •  
  •  

10.2-680-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరుల దూతయును ముర
రుచే నభయప్రదాన మంది ధరిత్రీ
రులకడ కేగి పద్మో
రు వచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్.

టీకా:

నరవరుల = రాజులు పంపిన; దూతయును = దూత; మురహరు = కృష్ణుని; చేన్ = చేత; అభయ = భయము లేదను మాట; ప్రదానము = ఇచ్చుట; అంది = పొంది; ధరిత్రీవరుల = రాజుల; కడ = వద్ద; కున్ = కు; ఏగి = వెళ్ళి; పద్మోదరు = కృష్ణుని {పద్మోదరుడు - పద్మము ఉదరమున కలవాడు, కృష్ణుడు}; వచనమున్ = మాటలను; చెప్పి = చెప్పి; సమ్మదంబునన్ = సంతోషము నందు; తేల్చెన్ = పొడచూప జేసెను.

భావము:

బంధీలుగా ఉన్న రాజుల దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడ శ్రీకృష్ణునిచే అభయప్రధానం అందుకుని, తిరిగి ఆ రాజుల వద్దకు వెళ్ళి వాసుదేవుడి వచనాలు వారికి వినిపించి వారిని సంతోష పెట్టాడు.