పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు

  •  
  •  
  •  

10.2-679-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాదుని మాధవుఁడు స
త్కారంబున వీడుకొలుప తఁడును హృదయాం
భోరుహమునఁ గృష్ణునకును
వాక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్.

టీకా:

నారదుని = నారదుడుని; మాధవుడు = కృష్ణుడు; సత్కారంబున = గౌరవముతో; వీడుకొలుపన్ = పంపగా; అతడునున్ = అతను; హృదయ = మనస్సు అను; అంభోరుహమునన్ = పద్మము నందు; కృష్ణున్ = కృష్ణుని; కును = కి; వారక = వదలకుండా; మ్రొక్కుచున్ = నమస్కరించుచు; వెసన్ = వడిగా; దివంబున్ = స్వర్గమున; కున్ = కి; అరిగెన్ = వెళ్ళిపోయెను.

భావము:

నారదమహర్షిని శ్రీకృష్ణుడు గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమటికీ నమస్కారాలు చేస్తూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు.